యువకుడు, బాలిక ఆత్మహత్యాయత్నం

Young Man And Girl Child Commits Suicide Attempt in Vikarabad - Sakshi

యువకుడు మృతి ప్రాణాలతో బయటపడిన బాలిక

పూడూరు: ఓ యువకుడు, బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు మృతిచెందగా బాలిక అదృష్టవశాత్తు బయటపడింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ ఠాణా పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ భీంకుమార్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని చన్గోముల్‌కు చెందిన మహేశ్‌(25), పూడూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా చనువుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల వారు గతంలోనే గుర్తించారు. అప్పట్లో మహేశ్‌పై కేసు పెట్టడంతో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడు గురువారం కస్తూర్బా పాఠశాలకు వెళ్లి బాలికను తన చెల్లిగా చెప్పుకుని కలిశాడు. ఇద్దరూ కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

తరచూ కలుసుకోవడం రెండు కుటుంబాల్లో తెలుస్తుందని, దీంతో ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో  సాయంత్రం కస్తూర్బా బాలికల హాస్టల్‌ సమీపంలో మైసమ్మగడ్డతండాకు వెళ్లే నిర్జన ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నారు. బాలిక ఉరివేసుకున్న చున్నీ ఆమె మెడ నుంచి జారిపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. మహేశ్‌ తాడుతో ఉరివేసుకోవడంతో బిగుసుకొని మృతి చెదాడు. బాలిక భయాందోళనతో హాస్టల్‌కు వెళ్లి జరిగిన విషయం తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిచారు. బాలికను చికిత్స నిమిత్తం వికారాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మహేశ్‌ మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top