భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావజ్జీవం

Woman, Lover Get Life Term For Killing Husband Who Opposed Their Affair - Sakshi

ముజ్జాఫర్‌నగర్‌ : ఇటీవల ప్రియుడి మోజులో పడి భార్యలు, తమ భర్తలను కడతేర్చుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలకు పాల్పడిన వారికి కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముజ్జాఫర్‌నగర్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. భర్త వారి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు గాను, వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి రవిందర్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం వీరికి ఈ శిక్ష విధించారు. అంతేకాక రహీస, ఆమె ప్రేమికుడు రిజ్వాన్‌కు రూ.7000 చొప్పున జరిమానా కూడా విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఐపీఎస్‌ సెక్షన్లు 302(హత్యానేరం), 201(సాక్ష్యాలు కనుమరుగు చేయడం) కింద ఈ శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్‌ ప్రకారం, రహీస, ప్రియుడి రిజ్వాన్‌తో కలిసి తన భర్త షానవాజ్‌ను 2010 జూన్‌ 15న హతమార్చింది. ఆ తర్వాత సాక్ష్యాలను కనుమరుగు చేసింది. షానవాజ్‌ దుకాణదారుడు. రహీస, రిజ్వాన్‌ల అక్రమ సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. షానవాజ్‌ హత్యపై అతని తమ్ముడు ఇస్లామ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top