ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

Tractor roll over..one dead - Sakshi

కరీంనగర్‌ జిల్లా : ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో ట్రాక్టర్‌ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ గొడుగుల భూమయ్య(53) అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం వద్ద నీళ్లు నింపుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమయ్య స్వగ్రామం బండకల్‌.  భూమయ్య మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top