మంచినీళ్లు అడిగి అత్యాచారయత్నం

Man Molestation on Girl Child in Karnataka - Sakshi

నిందితునిపై పోక్సో కేసు

 కర్ణాటక  ,హొసూరు: డెంకణీకోట సమీపంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని డెంకణీకోట మహిళా పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు. డెంకణీకోట తాలూకా సాకరపల్లి సమీపంలోని కొడియాళం గ్రామానికి చెందిన గణేష్‌ (23) నిందితుడు. సోమవారం ఉదయం మదగొండపల్లికెళ్లిన అతను ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిని తాగడానికి నీరు అడిగాడు. బాలిక నీరు తీసుకొచ్చేందుకు ఇంటి లోపలికెళ్లగానే గణేషన్‌ ఇంట్లోకి చొరబడి వాకిలికి గెడియపెట్టి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగానే గణేష్‌ పరారయ్యాడు. ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరిపి గణేష్‌పై ఫోక్సో  కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top