పాఠశాలలో విద్యుత్‌ వైరు తగిలి విద్యార్థి మృతి | Government School Student Dies With Electrocution In Nizamabad | Sakshi
Sakshi News home page

పాఠశాలలో విద్యుత్‌ వైరు తగిలి విద్యార్థి మృతి

Oct 25 2019 6:54 PM | Updated on Oct 25 2019 7:11 PM

Government School Student Dies With Electrocution In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : కోటగల్లీ ప్రభుత్వం పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్‌ వైరు తగిలి ఐదో తరగతి చదువుతున్న అయన్‌ ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందాడని గ్రాహస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై విచారించేందుకు పాఠశాలకు వచ్చిన జిల్లా విద్యాధికారి (డీఈఓ)ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. సెక్యూరిటీ మధ్య డీఈవోను పోలీసులు బయటకు పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement