అపహరణకు గురైన చిన్నారి

Girl Was Kidnapped In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలోని నందిపేట్‌ మండల కేంద్రంలో ఓ పాప అపహరణకు గురైంది. ప్రైవేట్‌ పాఠశాల నుంచి ఓ మహిళ వచ్చి ఆ పాపను తీసుకెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపింది. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్‌ సిబ్బందిని విచారించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఏవరో తెలియదని, ఆమె వచ్చి పాపను తీసుకెళ్లిందని సిబ్బంది తెలపగా.. ఆ గుర్తు తెలియని మహిళ ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top