గంజాయి అమ్ముతున్న ఒకరి పట్టివేత   | Capturing someone who sells marijuana | Sakshi
Sakshi News home page

గంజాయి అమ్ముతున్న ఒకరి పట్టివేత  

Mar 26 2018 10:01 AM | Updated on Oct 9 2018 2:23 PM

కరీంనగర్‌క్రైం: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ఒకరిని ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చూపారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ చాంద్‌ పాషా విద్యార్థులకు గం జాయి విక్రయిస్తున్నాడు. బయటినుంచి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి రూ.200 చొప్పున అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. అదివారం రేకుర్తి సమీపంలో అమ్మకాలు చేస్తుండగా సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడి వద్ద 250 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement