భూకబ్జా కేసులో హైకోర్టుకు బోండా సతీమణి | bonda sujatha filed pitition in high court over land kabza case | Sakshi
Sakshi News home page

భూకబ్జా కేసులో హైకోర్టుకు బోండా సతీమణి

Feb 22 2018 10:43 AM | Updated on Aug 31 2018 8:40 PM

bonda sujatha filed pitition in high court over land kabza case - Sakshi

భర్త బోండా ఉమా మహేశ్వరరావుతో బోండా సుజాత(ఫేస్‌బుక్‌ నుంచి తీసుకున్న ఫొటో)

సాక్షి, అమరావతి : విజయవాడ స్వతంత్ర సమర యోధుడి భూమి కబ్జా కేసులో ఎమ్మెల్యే బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ పిటీషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు.

1951లో సూర్యనారాయణ అనే  స్వాతంత్య్రసమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్‌ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్‌ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. దాంతో మొత్తం ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement