పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి గర్భవతిని చేసిన సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటన విశాఖపట్నంలోని చోడవరం మండలం గౌరవరం గ్రామంలో చోటుచేసుకుంది. జొన్నపల్లి జగన్నాథం అనే ఆర్మీ ఉద్యోగి ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు చోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మీ ఉద్యోగిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.