♦ సామాజిక భద్రత పథకాలకు మంచి స్పందన.
♦ సురక్ష బీమా పథకానికి అధిక ఆదరణ
♦ అటల్ పెన్షన్ పథకానికి నామమాత్రపు స్పందన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక భద్రతా పథకాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకాల్లో సుమారు 12 కోట్ల మంది చేరితే అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ పథకాల్లో చేరుతున్నవారి సంఖ్య కోటి మార్కును సమీపిస్తోంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన ఇచ్చిన స్ఫూర్తితో కేంద్రం అందరికీ బీమా రక్షణ, పెన్షన్ కల్పించే విధంగా మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది.
కేవలం ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా ప్రయోజనం కల్పించే విధంగా సురక్ష బీమా, రూ. 330 వార్షిక ప్రీమియంతో రెండు లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని కల్పించే విధంగా జీవన్ జ్యోతి బీమా పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానిచ్చే విధంగా అటల్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ మూడింటిలో సురక్ష బీమాకి అత్యధిక ఆదరణ లభిస్తుండగా, పెన్షన్ పథకంలో తక్కువ చేరుతున్నారు. తక్కువ ప్రీమియం ఉండటం, 70 ఏళ్ళ వారి వరకూ తీసుకోవడానికి అర్హత ఉండటంతో సురక్ష బీమా పథకంలో అత్యధికమంది చేరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ(ఏపీఎస్ఎల్బీసీ) పేర్కొంది.
జీవన్ జ్యోతిలో 50 ఏళ్ల లోపు వారు మాత్రమే చేరే అవకాశం ఉండటం, ప్రీమియం ఏటా రూ. 330 చెల్లించాల్సి రావటంతో తక్కువ మంది చేరుతున్నట్లు ఏపీఎస్ఎల్బీసీ తెలిపింది. అలాగే పెన్షన్ పథకంలో చేరే వారి వయస్సు, ఆదాయం పరిమితులు వంటి అనేక షరతులు విధించడంతో ఇందులో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. ఈ పథకాల్లో చేరడానికి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగవచ్చనేది ఇరు రాష్ట్రాల బ్యాంకర్ల కమిటీ అంచనా. గడువు ముగిసేనాటికి రెండు రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య 2 కోట్లు దాటొచ్చన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కోటికి చేరువ
Published Thu, Jun 25 2015 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement