న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా.. ఉద్యోగార్థుల కోసం జాతీయ స్థాయిలో మొబైల్ జాబ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో సరల్ రోజ్గార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు బుధవారం ప్రకటించింది. రూ. 50 వెచ్చించి ఈ సరల్ రోజ్గార్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సర్వీసులను పొందవచ్చని పేర్కొంది. తదనంతరం 1860-180-1100 నంబర్కు డయల్ చేసి తమకు నచ్చిన భాషలో వాయిస్కాల్ ద్వారా భారత్లోని ఏ ప్రదేశం నుంచైనా ఉద్యోగార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చని టెక్ మహీంద్రా మొబిలిటీ బిజినెస్ హెడ్ జగదీశ్ మిత్రా వెల్లడించారు.
ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, గ్రాడ్యుయేట్ కంటే కింది స్థాయిలోని(దినసరి వేతనంతో పనిచేసే వర్కర్లు, ఎంట్రీలెవెల్) కొలువుల కోసం వేచిచూసే అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తగా ఈ మొబైల్ జాబ్ మార్కెట్ ప్లేస్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్పొరేట్, ప్రధాన కంపెనీలకు తమ అర్హతలను సరైన రీతిలో తెలియజేసేందుకు వీలుగా తొలిసారి రెస్యూమెలను రూపొందించుకునేవారికి తాము సహకారం కూడా అందిస్తామని మిత్రా చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)/ఎంట్రప్రెన్యూర్స్ కూడా ఈ సేవల ద్వారా రిజిస్టర్ అయినవారికి వాయిస్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ప్రస్తుతం 100కుపైగా ఉద్యోగ విభాగాల్లో లక్షకు పైబడి జాబ్స్ సరల్ రోజ్గార్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టెక్ మహీంద్రా వైస్ప్రెసిడెంట్(మొబిలిటీ, వ్యాస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో) వివేక్ చందోక్ చెప్పారు. రిటైల్, అకౌంటింగ్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషీన్ ఆపరేటర్, కుక్స్, సెక్యూరిటీగార్డులు, డెలివరీ బాయ్స్ వంటి కేటగిరీల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా టెలికం రీచార్జ్ సేవలందించే రిటైల్ అవుట్లెట్స్ వద్ద ఈ సరల్ రోజ్గార్ కార్డులు లభిస్తాయని చందోక్ తెలిపారు.
టెక్మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్ఫామ్
Published Thu, Aug 28 2014 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement