మార్కెట్లోకి పియాజియో ‘ఏప్ ఈ–సిటీ’
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్లలో అందుబాటులోకి తెస్తోంది.