మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ | OnePlus 5 launched in India today, price starts at Rs 32,999 | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

Jun 23 2017 12:39 AM | Updated on Sep 5 2017 2:14 PM

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’ తాజాగా ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ప్రారంభ ధర రూ.32,999
ముంబై: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’ తాజాగా ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 6 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్లమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.32,999, రూ.37,999గా ఉన్నాయి.

వినియోగదారులు ఈ ఫోన్లను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్‌–హెచ్‌డీ స్క్రీన్, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 16 ఎంపీ+ 20 ఎంపీ రియర్‌ డ్యూయెల్‌ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement