ఆయిల్‌ ఇండియా షేర్ల బైబ్యాక్‌ | Oil India to buy back 4.45% shares for Rs 1085 crore | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ఇండియా షేర్ల బైబ్యాక్‌

Nov 24 2018 1:46 AM | Updated on Nov 24 2018 1:46 AM

Oil India to buy back 4.45% shares for Rs 1085 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ ఇండియా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆయిల్‌ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది.

షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.5,000 కోట్లు ! 
ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్‌ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్‌ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రా 

Advertisement
 
Advertisement
Advertisement