⇔ క్యూ4లో రూ.3,720 కోట్లు
⇔ కలిసొచ్చిన అధిక రిఫైనరీ మార్జిన్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఐవోసీ మార్చి త్రైమాసికానికి సంబంధించి బంపర్ ఫలితాలను ప్రకటించింది. అధిక రిఫైనరీ మార్జిన్ల అండతో కంపెనీ లాభం ఏకంగా 85 శాతం పెరిగి రూ.3,720 కోట్లకు చేరుకుంది. షేరు వారీ ఆర్జన రూ.7.85గా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో సంస్థకు వచ్చిన లాభం రూ.2,000 కోట్లే. లాభాల్లో భారీ వృద్ధికి అధిక రిఫైనరీ మార్జిన్లకు తోడు ఇన్వెంటరీ గెయిన్స్ కారణమని ఐవోసీ చైర్మన్ బి.అశోక్ విలేకరులకు తెలిపారు. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.1,22,285 కోట్లుగా నమోదైంది. దేశంలో అతి పెద్ద రిఫైనరీ సంస్థ అయిన ఐవోసీ మార్చి త్రైమాసికంలో 17.1 మెట్రిక్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ప్రతీ బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 8.95 డాలర్లను ఆర్జించింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది కేవలం 3 డాలర్లుగానే ఉండడం గమనార్హం. 2015–16 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇన్వెంటరీ పరంగా కంపెనీ రూ.3,417 కోట్ల నష్టాలను ఎదుర్కోగా... తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,634 కోట్ల ఇన్వెంటరీ లాభాలు మెరుగైన ఫలితాలకు కారణమయ్యాయి. కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసి శుద్ధి చేసి విక్రయించే లోపు ధరలు పెరిగితే దాన్ని ఇన్వెంటరీ లాభాలుగా పేర్కొంటారు.
ఒకవేళ ధరలు తగ్గితే నష్టాలు ఎదురవుతాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్టాండలోన్ లాభం 11,242 కోట్ల నుంచి రూ.19,160 కోట్లకు వృద్ది చెందింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభంగా ఐవోసీ చైర్మన్ అశోక్ పేర్కొన్నారు. ఎగుమతులు సహా 2016–17లో 83.49 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విక్రయించినట్టు చెప్పారు. ఇంధన రిటైలింగ్ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని అశోక్ చెప్పారు. కాగా, షేరు ఒక్కింటికీ రూ.1 తుది డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది.
ఐవోసీ లాభం 85% అప్
Published Fri, May 26 2017 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement