జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు | GSM mobile additions at 5.15 million in January: COAI | Sakshi
Sakshi News home page

జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు

Feb 18 2017 3:27 AM | Updated on Sep 5 2017 3:57 AM

జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు

జనవరిలో కొత్త మొబైల్‌ యూజర్లు@51 లక్షలు

మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల పెరుగుదల జనవరిలో 51.1 లక్షలుగా ఉందని టెలికం పరిశ్రమ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది.

న్యూఢిల్లీ: మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల పెరుగుదల జనవరిలో 51.1 లక్షలుగా ఉందని టెలికం పరిశ్రమ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్‌లో నమోదైన కొత్త సబ్‌స్క్రైబర్ల (81.8 లక్షలు)తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని తెలిపింది. దేశంలోని మొత్తం జీఎస్‌ఎం సబ్‌స్రైబర్ల సంఖ్య జనవరిలో 81.51 కోట్లకు చేరిందని పేర్కొం ది. దీనికి రిలయన్స్‌ జియో యూజర్లు అదనం. ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య 35.5 లక్షల పెరుగుదలతో 26.94 కోట్లకు చేరింది. 2016 డిసెంబర్‌ 31కి జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement