అనంతలో కదం తొక్కిన విద్యార్థులు | ysrcp student leaders protests over ap special status in sri krishnadevaraya university | Sakshi
Sakshi News home page

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు

Jan 25 2017 12:31 PM | Updated on Mar 23 2019 9:10 PM

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు - Sakshi

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు

ఏపీకి హోదా సాధించేంత వరకు పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేతలు స‍్పష్టం చేశారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సలాంబాబా డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో బుధవారం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ బంద్ చేపట్టారు. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. హైవేను దిగ్భంధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.  

ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట‍్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి హోదా సాధించేంత వరకు పోరాడతామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు గురువారం జిల్లాలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement