
కొడికొండలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొడికొండలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం కొడికొండ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు.
అనంతపురం జిల్లా రైతులకు అండగా నిలుస్తూ, హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలన్న ప్రధాన డిమాండ్తో వైఎస్ జగన్ సోమవారం ఉరవకొండలో మహాధర్నా చేపట్టనున్న విషయం తెలిసిందే.