అనంతపురం ఉరవకొండలో తాగునీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు
అనంతపురం : అనంతపురం ఉరవకొండలో తాగునీటి సమస్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాగా మండల కేంద్రంలోని పూరి గుడిసెల కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిన్న ఎంపీడీవో కార్యాలయం ఎదుట కదిరి-హిందుపురం రహదారిపై రాస్తారోకో చేశారు.