వేంపల్లె: ఏసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె సెమీ క్రిస్మస్ వేడుక ల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, మనుమడు రాజారెడ్డి, మనుమరాలు అంజలి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ జయమ్మ, వైఎస్ సుధీకర్రెడ్డి, సోదరి వైఎస్ విమలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ సునీల్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, వైఎస్ థామస్రెడ్డి, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజక సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఇడుపులపాయకు వచ్చారు.
సోమవారం ఉదయం వైఎస్సార్ ఘాట్లో మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలను ప్రేమించే వారందరిని కూడా ఏసు ప్రభువు సంతోషం, ప్రేమ, సమాధానం అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్, నరేష్ల ఆధ్వర్యంలో వైఎస్ కుటుంబసభ్యులు, బంధువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఏసు ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి
Published Mon, Dec 24 2018 9:21 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement