కురుపాంలో వైఎస్సార్ జ్ఞాపకాలు పదిలం....
అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజు
విజయనగరం , ప్రజాసంకల్పయాత్ర బృందం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ రాజకీయ చరిత్రలోనే మరిచిపోలేని నేతగా కీర్తి పొందారని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్రాజు అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి మండలంలో తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఆదివారం మాట్లాడారు. ముఖ్యంగా కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్ జ్ఞాపకాలు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు సమయంలో ఎంతో మంది నిర్వాసితులకు ఇళ్లు కట్టించి ఇచ్చారని అన్నారు. వైఎస్సార్ జ్ఞాపకాలతోనే ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు.