రంజాన్‌ నెల ప్రారంభం : వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy Ramzan Wishes To Muslims | Sakshi
Sakshi News home page

రంజాన్‌ నెల ప్రారంభం : వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

May 16 2018 9:37 PM | Updated on Oct 16 2018 6:01 PM

YS Jagan Mohan Reddy Ramzan Wishes To Muslims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement