ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసింది... ప్రభుత్వ మోసపూరిత విధానం బట్టబయలైంది... ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాభేరి మోగనుంది. ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. రుణమాఫీ అమలులో ప్రభు త్వ వైఖరి, హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం మహాధర్నాకు సర్వం సిద్ధమైంది.
⇒ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యక్ష కార్యాచరణ
⇒ నేడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ధర్నా
⇒ సమాయత్తమవుతున్న వైఎస్సార్కాంగ్రెస్ శ్రేణులు
⇒ భారీగా తరలిరానున్న ప్రజలు
⇒ అధికార జులుంతో ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వ కుట్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చరిత్రాత్మక ప్రజాపోరాటానికి జిల్లా కలెక్టరేట్ వేదికగా నిలవనుంది. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించే ఈ ధర్నాలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పాల్గొననుండటం జిల్లాకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. దాంతో ఈ ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా యావత్తూ కదలివస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కొన్ని రోజులుగా సన్నాహాలను ముమ్మరం చేశారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడ గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజులతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ధర్నా విజయవంతం చేయాల్సిన ఆవశ్యతకను కార్యకర్తలను వివరించారు. రైతులు, మహిళలు, తుపాను బాధితులు, అని వర్గాల ప్రజలు వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్కృష్ణరంగారావు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం జిల్లావ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తపరిచారు. దాంతో శుక్రవారం ధర్నాకు జిల్లావ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చేందుకు సంసిద్ధమయ్యారు.
పోలీసుబలంతో అధికార జులుం: వెల్లువెత్తుతున్న సానుకూలత ప్రభుత్వంలో కలవరం కలిగిస్తోంది. అందుకే పోలీసు బలాన్ని ప్రయోగిస్తోంది. 2వేలమంది పోలీసులను మోహరించడం గమనార్హం. ధర్నాకు వచ్చే వాహనాలను అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు విశాఖలోనూ గ్రామాల్లోనూ పోలీసులు ప్రైవేటు వాహన యజమానులను బెదిరిస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదో ఒక సాకుతో నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీ సుకోవాలని కుట్ర పన్నుతోంది. మరోవైపు ధర్నాలకు అనుమతిలేదం టూ పోలీసులు గురువారం రాత్రి హడావుడిగా ఓ ప్రకటన విడుదల చేయ డం సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే పోలీ సులు ఈ ప్రకటన విడుదల చేశారని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ధర్నా ను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు కూడా కుట్రలు పన్నుతున్నారు.
శాంతియుతంగా ధర్నా...: వైఎస్సార్ కాంగ్రెస్
శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా శుక్రవారం ధర్నా నిర్వహిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆద్యంతం పార్టీ కార్యకర్తలు శాంతియుతంగానేవ్యవహరిస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించారు.
వై.ఎస్.జగన్ పర్యటన ఇలా...
జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం వెల్లడించిన వివరాల ప్రకారం... జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సర్క్యూట్ గెస్ట్హౌస్కు వస్తారు. అక్కడ కొంతసేపు ఉన్న తరువాత ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు.
సమరభేరి!
Published Fri, Dec 5 2014 12:42 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement