మహిళా కౌలు రైతు ఆత్మహత్య | women farmer commits suicide in prakasam district | Sakshi
Sakshi News home page

మహిళా కౌలు రైతు ఆత్మహత్య

Feb 10 2016 12:35 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది.

ప్రకాశం: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కల్లవారిపాలెం గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన గొట్టిపాటి విజయకుమారి(41) 18 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసింది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం సుమారు రూ. 15 లక్షల వరకు అప్పులు తెచ్చింది. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement