వేధిస్తున్న భర్తను హతమార్చిన భార్య | Wife kills husband in kurnool district | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న భర్తను హతమార్చిన భార్య

Oct 20 2014 8:47 AM | Updated on Aug 21 2018 5:46 PM

కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త వేధింపులు భరించలేని భార్య అతడిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్త వేధింపులు భరించలేని భార్య అతడిని హతమార్చిన  ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిద్రిస్తున్న భర్త తలపై బండరాయితో మోది హత్య చేసింది. వివరాల్లోకి వెళితే దస్తగిరి, చిట్టెమ్మలు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

అయితే దస్తగిరి భార్యపై అనుమానంతో నిత్యం చిట్టెమ్మను వేధిస్తుండేవాడు. దాంతో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పినా ఈ వివాదానికి తెరపడలేదు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు మితిమీరటంతో సహనం కోల్పోయిన చిట్టెమ్మ నిద్రిస్తున్న గత అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది హత్య చేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  దస్తగిరి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement