కేకే లైన్‌లో విరిగిపడిన కొండచరియలు | Virigipadina landslides in KK | Sakshi
Sakshi News home page

కేకే లైన్‌లో విరిగిపడిన కొండచరియలు

May 20 2016 5:14 AM | Updated on Sep 4 2017 12:27 AM

కేకే లైన్‌లో విరిగిపడిన కొండచరియలు

కేకే లైన్‌లో విరిగిపడిన కొండచరియలు

కొత్తవలస-కిరండోల్ లైన్లో పలు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పట్టాలు తప్పిన గూడ్‌‌స రైలు
కిరండూల్-విశాఖ పాసింజర్ రద్దు

పలు గూడ్స్ రైళ్లు దారిమళ్లింపు

 

అనంతగిరి/విశాఖపట్నం : కొత్తవలస-కిరండోల్ లైన్లో పలు రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు చిముడుపల్లి- బొర్రాగుహలు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటంతో కిరండోల్ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులను వేగవంతం చేశారు. ఇటు విశాఖపట్నం అటు కోరాపుట్ నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రెండు యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు అక్కడికి బయలుదేరి వెళ్లాయి. క్రేన్ సహాయంతో కొండచరియలను తొలగించేపనిలో నిమగ్నమయ్యారు.

 
రైళ్లు రద్దు: కేకే లైన్‌లో కొండచరియలు విరగిపడటంతో కిరండోల్-విశాఖపాసింజర్‌ను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇప్పటికే అదే లైన్‌లో రాకపోకలు సాగించాల్సిన 9 గూడ్స్‌రైళ్లను వయా రాయగడ మీదుగా మళ్లించారు.


అరకు వరకే రైళ్లు: గురువారం కిరండోల్ నుంచి విశాఖ బయ లు దేరి రావాల్సిన కిరండోల్- విశాఖపట్నం(58502) పాసింజర్ అరకు వరకూ మాత్రమే నడుపుతున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే శుక్రవారం విశాఖ నుంచి బయలుదేరి కిరండోల్ వెళ్లాల్సిన పాసింజర్ (58501) అరకు నుంచి బయలుదేరి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement