స్తంభానికి కట్టేసి కొట్టారు | Sakshi
Sakshi News home page

స్తంభానికి కట్టేసి కొట్టారు

Published Tue, Jan 27 2015 2:47 AM

స్తంభానికి కట్టేసి  కొట్టారు

శ్రీకాళహస్తి రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఓ యుువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ సంఘటన సోవువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ సంజీవకుమార్ కథనం మేరకు.. మండలంలోని కోదండరామాపురం గ్రామంలో మునస్వామిరెడ్డి, బక్కారెడ్డి కుటుంబాలకు ముడేళ్లుగా పాతకక్షలున్నారుు. ఈ క్రమంలో మునస్వామి రెడ్డి(27)కి వస్తున్న పెళ్లి సంబంధాలను బక్కారెడ్డి వర్గం చెడగొట్టేది. ఈ విషయంపై మునస్వామిరెడ్డి శనివారం బక్కారెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించాడు.

దీంతో బక్కారెడ్డితో పాటు భూపతి, దయూకర్, మోహన్, కౌసల్య కలిసి అతడిని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అతడు తీవ్రంగా గాయుపడటంతో స్థానికులు శ్రీకాళహస్తి ఏరియూ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తనపై వుునస్వామిరెడ్డి దాడి చేశాడంటూ కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేయుడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నావుని ఎస్‌ఐ వివరించారు.
 
 

Advertisement
Advertisement