అసెంబ్లీ లీక్‌పై మూడో రోజూ సీఐడీ దర్యాప్తు | third day cid enquiry on rain water leak in ap assembly, secretariat | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ లీక్‌పై మూడో రోజూ సీఐడీ దర్యాప్తు

Jun 9 2017 1:26 PM | Updated on Jul 29 2019 2:44 PM

సచివాలయం,అసెంబ్లీల్లో వర్షపు నీరు లీక్‌ అవడంపై సీఐడీ విచారణ మూడో రోజూ కొనసాగింది.

అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీల్లో వర్షపు నీరు లీక్‌ అవడంపై సీఐడీ విచారణ మూడో రోజూ కొనసాగింది. సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు, సిబ్బంది వర్షపు నీరు లీక్‌ అయిన ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జేఎన్టీయూ ప్రొపెసర్ల బృందం కూడా శుక్రవారం అసెంబ్లీని సందర్శించింది.

వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement