నిర్బంధ ఉద్యోగ విరమణ వెనుక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ప్రమేయం: రిటైర్డ్ జడ్జి ఎం.కృష్ణప్ప
నెల్లూరు(లీగల్): న్యాయవ్యవస్థలో కొన్ని మీడియా సంస్థలు మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయని, ఇది తగదని నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ (5వ అదనపు) జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో జన్మించి పలువురి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని, బాధ్యతల నిర్వహణలో ప్రలోభాలకు తలొగ్గక నీతి, నిజాయితీలతో పనిచేశానని తెలిపారు.
ఫలితంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన ఓ పరువునష్టం కేసులో అన్ని ఆధారాలు ఉండటంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చానన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ విషయం మనసులో పెట్టుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాడన్నారు. తనపై గతంలో అసత్య ఆరోపణలు చేస్తూ పత్రికల్లో వాటిని ప్రచురించి హైకోర్టు ద్వారా తనను సస్పెండ్ చేయించారని తెలిపారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు విచారణ జరిపి తనకు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. తనను నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించడం వెనుక రాధాకృష్ణతో పాటు కొన్ని శక్తులు పనిచేశాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణతో ఏ వేదికపైన అయినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దమ్మున్న చానల్ అని చెప్పుకుంటున్న ఏబీఎన్ యజమాని దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు.
న్యాయవ్యవస్థలో మీడియా జోక్యం తగదు
Published Sat, Oct 1 2016 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement