‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఉన్నపళంగా పొమ్మని గెంటేస్తే ఎక్కడికి పోతాం. మా తాతల కాలం నుంచీ ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్నామన్న సాకుతో ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మనడం భావ్యమా..’ అంటూ బీసెంట్రోడ్డులోని 500 మంది హాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం వారిని ఖాళీచేయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన బాట పట్టిన వారికి వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది.
బీసెంట్రోడ్డు హాకర్లు
విజయవాడ సెంట్రల్ : ఆక్రమణల తొలగింపు ముసుగులో బీసెంట్రోడ్డులోని హాకర్లను ఖాళీ చేయించడం వివాదాస్పదంగామారింది. సుమారు 500 మంది హాకర్లు అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నలభైఏళ్ళ నుంచి బీసెంట్రోడ్డునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్కు సమీపంలో ఉండడంతో హాకర్లను అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టౌన్ప్లానింగ్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై వ్యాపారాలు చేసుకొనే చిన్నా చితక వ్యాపారుల్ని అక్కడ నుంచి గెంటేశారు. బుధవారం ఉదయం కూడా వ్యాపారాలు చేయకుండా పోలీసులు గస్తీకాశారు. హాకర్లు ఆందోళన బాట పట్టారు. ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముజ్ఫర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ బాసట
బాధిత హాకర్లకు వైఎస్సార్సీపీ బాసటగా నిల్చింది. వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్లీడర్ బీఎన్ పుణ్యశీల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు హాకర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పుణ్యశీల మాట్లాడుతూ పేదల పొట్టకొట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా గెంటేస్తే ఎక్కడిపోతారని ప్రశ్నించారు. దీనిపై ఈనెల 29న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అధికారపార్టీని నిలదీస్తామన్నారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కార్పొరేటర్లు షేక్బీజాన్బీ, పి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన పేదోళ్లు బతక్కూడదంటే ఎలా. మా తాతల కాలం నుంచి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాం. టీడీపోళ్లు ఓట్లు అడిగేటప్పుడు మీరు దర్జాగా ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. పోలీసోళ్లు, కార్పొరేషనోళ్లు వచ్చి జులుం చేస్తున్నారని ఫోన్ చేస్తే మాట్లాడటమే మానేశారన్నారు. చావనైనా చస్తాం కానీ బీసెంట్రోడ్డును వదిలేదిలేదని హాకర్లు స్పష్టం చేస్తున్నారు.
చావనైనా చస్తాం.. కదిలేది లేదు
Published Thu, Jan 21 2016 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement