బస్సు, కారు ఢీ: ఇద్దరి దుర్మరణం | The bus , car collide : two dead | Sakshi
Sakshi News home page

బస్సు, కారు ఢీ: ఇద్దరి దుర్మరణం

Sep 22 2015 10:50 AM | Updated on Apr 3 2019 7:53 PM

బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరుకు చెందిన కొందరు భక్తులు కారులో తిరుపతికి వెళ్తుండగా గంగవరం సమీపంలో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సులోని 12 మంది ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement