తెలంగాణ నోట్ సిద్ధం: పోలీస్ శాఖ అప్రమత్తం | Telangana Note Ready:Police Alert | Sakshi
Sakshi News home page

తెలంగాణ నోట్ సిద్ధం: పోలీస్ శాఖ అప్రమత్తం

Oct 3 2013 6:50 PM | Updated on Aug 21 2018 5:54 PM

తెలంగాణ నోట్ సిద్ధమైన నేపధ్యంలో కేంద్ర హొం శాఖ రాష్ట్రంలో పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ నోట్ సిద్ధమైన  నేపధ్యంలో  కేంద్ర హొం శాఖ రాష్ట్రంలో పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రత పెంచాలని జిల్లా ఎస్పిలను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని చెప్పారు. రబ్బర్ బుల్లెట్లు వాడవద్దని ఆదేశించారు.

రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సీమాంధ్రలో 60 రోజుల నుంచి ఉధృతస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ పరిస్థితులలో తెలంగాణ నోట్ సిద్ధమైంది. కేంద్ర మంత్రి మండలి సమావేశం ముందుకు నోట్ వెళ్లింది. దీనిపై మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంటే ఏమైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తుతాయోమోనని పోలీస్ శాఖ అప్రమత్తమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement