మార్షల్స్తో టీడీపీ నేతల గొడవ

సాక్షి, అమరావతి : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీడీపీ నాయకులు మార్షల్స్తో అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోపలికి ప్లకార్డులు తీసుకువెళ్తాం అంటూ వాళ్లు మార్షల్స్తో గొడవపడ్డారు. అయినప్పటికీ మార్షల్స్ ప్లకార్డులను లోపలికి అనుమతించకపోవడంతో.. టీడీపీ నాయకులు ఖబర్దార్ అంటూ వారిని హెచ్చరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి