తెలుగు తమ్ముళ్ల కొట్లాట | tdp cadre clashes out in hinduupur | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల కొట్లాట

Jan 28 2015 6:44 PM | Updated on Sep 2 2017 8:25 PM

అధికార పార్టీలో ఆదిపత్య పోరు రోజురోజుకు ఎక్కువవుతోంది. బాలకృష్ణ నియోజకవర్గం హిందుపురంలో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ అంతర్గత గొడవలు మరోసారి బయటపడ్డాయి.

అనంతపురం: అధికార పార్టీలో ఆదిపత్య పోరు రోజురోజుకు ఎక్కువవుతోంది. బాలకృష్ణ నియోజకవర్గం హిందుపురంలో ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ అంతర్గత గొడవలు మరోసారి బయటపడ్డాయి. హిందూపూర్ నియోజక వర్గ పరిధిలోని చిలమత్తూరు రిచ్‌మన్ ఫ్యాక్టరీలో బుధవారం జరిగిన మండలస్థాయి సమావేశంలో తెలుగుదేశం కార్యకర్తలు మధ్య వాగ్వాదం తలెత్తింది.

రైతు సంఘం నాయకుడు బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ అన్సారీ వర్గాలమధ్య ప్రారంభమైన మాటల దాడి కొట్లాట దాకా వెళ్లింది. ఆ సమయంలో ఎంపీపీ వర్గీయులు కుర్చీలతో రైతు నాయకులపై దాడికి దిగారు. ఈ దాడికి నిరసనగా రైతు నాయకులు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement