తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం | swamy nityananda visits Tirumala along with ranjita | Sakshi
Sakshi News home page

తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం

Jun 18 2014 11:36 AM | Updated on Sep 2 2017 9:00 AM

తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం

తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం

వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.

తిరుమల : గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన  సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో నిత్యానంద తన శిష్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాషాయ వేషధారణలో ఉన్న రంజిత...నిత్యానందతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిత్యానంద నిరాకరించారు. కాగా  రంజిత ఇటీవలే బెంగళూరులోని బిడిది ధ్యానపీఠంలో సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె తన పేరును మా ఆనందమయి గా మార్చుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement