ఉంగుటూరు : ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి నారాయణపురంలో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాని మాట్లాడారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలతో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా ఉండి పోరాడతామని నాని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడితే అవసరమైతే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడతారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయటంతో పాటు, మండల, జిల్లా కమిటీలలో నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామన్నారు. రుణమాఫీ, ఎన్నికల వాగ్ధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన కుతంత్రాలను ప్రజలు గ్రహించాలన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. యానిమేటర్ల సమ్మె, వారి సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని నాని హామీ ఇచ్చారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సమస్యలపై నిలదీయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జీఎస్ రావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రుణామాఫీని పంచవర్ష ప్రణాళికగా అమలు చేస్తామని చెప్పటం అందరినీ మోసగించటమేనన్నారు. పింఛన్దారుల ఎంపికలో పచ్చ చొక్కాలకే అవకాశమిచ్చారని, అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ తప్పులు వాగ్ధానాలు చేసి చంద్రబాబు గెలిచారని, ప్రజలు మోసపోయినట్టు ఇప్పుడు గ్రహిస్తున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు ఎప్పడూ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఒక్కరినీ మరిచిపోనని, ఎక్కడైనా సమన్వయలోపం ఉంటే సరిదిద్దుకుని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాన్నారు. సమావేశానికి ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ జిల్లా నాయకుడు ఘంటా ప్రసాదరావు, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పటగర్ల రామ్మోహనరావు, ఎంపీటీసీ సభ్యులు తోట సత్యనారాయణ, గాలింకి ప్రమీలారాణి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నేకూరి ఆశీర్వాదం, వైఈసీ నాయకులు బండారు నాగరాజు, సలాది భీమరాజు, కలిదిండి సుబ్బతాతరాజు, చల్లా సూర్యారావు, నడిపంల్లి సోమరాజు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం
Published Mon, Oct 6 2014 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement