హుదూద్ పెను తుపాన్గా మారడంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్గా మారడంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం మీదుగా పలు రైళ్లను రద్దు చేసే అవకాశముంది.
ఈ నెల 11 నుంచి 13 వరకు పలు రైలు సర్వీసులను పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశముందని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికులకు ఈ మేరకు సూచనలు చేసింది.