జంట హత్యల కుట్ర కేసులో ఏడుగురు అరెస్ట్


అమలాపురం(తూర్పుగోదావరి): జంట హత్యలకు కుట్రచేసిన ముఠా సభ్యుల్లో మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నాలుగు రోజుల క్రితం జంట హత్యలకు ఒక రౌడీషీటర్ల ముఠా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసి అదే రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. కాగా, ఆదివారం పోలీసులు ఆ ముఠాకు చెందిన ఐదుగురు రౌఢీ షీటర్లను అరెస్ట్ చేశారు. కొండ్రు రవికుమార్, వాసంశెట్టి వెంకటసత్యనారాయణ, అన్యం సాయిదుర్గాకుమార్, గొడి దుర్గాప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మిగిలిన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top