ఈనెల 30 వరకూ సీమాంధ్ర న్యాయవాదుల విధుల బహిష్కరణ | Seemandhra Lawyers Suspension of duties till august 30 | Sakshi
Sakshi News home page

ఈనెల 30 వరకూ సీమాంధ్ర న్యాయవాదుల విధుల బహిష్కరణ

Aug 18 2013 2:10 AM | Updated on Sep 1 2017 9:53 PM

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, సీమాంధ్ర జిల్లాల్లోని 35వేల మంది న్యాయవాదులు ఈ నెల 30 వరకూ విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారావు కోరారు.

సాక్షి, రాజమండ్రి : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, సీమాంధ్ర జిల్లాల్లోని 35వేల మంది న్యాయవాదులు ఈ నెల 30 వరకూ విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారావు కోరారు. సీమాంధ్ర జిల్లాల న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు శనివారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమావేశం డిమాండ్ చేసిందన్నారు. ఈనెల 31న గుంటూరులో మరోసారి  సమావేశమై తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement