బాలిక ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ సస్పెండ్ | school principal suspended in girl suicide case | Sakshi
Sakshi News home page

బాలిక ఆత్మహత్య ఘటనలో ప్రిన్సిపల్ సస్పెండ్

Feb 25 2015 7:13 PM | Updated on Sep 15 2018 5:45 PM

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రిన్సిపలేనంటూ బాలిక కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

పశ్చిమగోదావరి (పెదపాడు): పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రిన్సిపలేనంటూ బాలిక కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వడ్లూరు గురుకుల పాఠశాల ఎదుట గల జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో..  ఆ స్కూలు ప్రిన్సిపల్ నంబూరి భారతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యాజమాన్యం వేధింపుల వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్, ల్యాప్‌టాప్‌లు ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement