వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఇస్తున్నట్లే కాపు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్లు మంజూరు చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు.
రాజమహేంద్రవరం: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఇస్తున్నట్లే కాపు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్లు మంజూరు చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. కాపుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్లు మంజూరు చేయాలనుకుంటున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ వివరించారు.