తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | The rush of devotees in Thirumala is common | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Dec 22 2017 8:13 PM | Updated on Dec 22 2017 8:13 PM

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టమెంట్లో భక్తులు వేచియున్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను  జేఈఓ శ్రీనివాస రాజు, ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. 1400 మంది పోలీసులతో టీటీడీ ఏకాదశి రోజున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి ఏకాదశి దర్శనానికి కంపార్టమెంట్లోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 72 వేల మంది వేచి ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement