ప్రకాశం జిల్లా దుద్దిపాడు జాతీయ రహదారిపై సోమవారం దోపిడీ జరిగింది.
ప్రకాశం : ప్రకాశం జిల్లా దుద్దిపాడు జాతీయ రహదారిపై సోమవారం దోపిడీ జరిగింది. వివరాలు... మద్దిపాడుకు చెందిన మారినేని వెంకటశేషయ్య స్థానిక సిండికేట్ బ్యాంక్ నుంచి రూ. లక్ష డ్రా చేశారు. అనంతరం అతడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దోపిడీ చేశారు. అతడి వద్ద ఉన్న లక్ష రూపాయలతో పాటు బ్యాంక్ పాస్ బుక్, మూడు బాండ్ పేపర్లు లాకెళ్లారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మద్దిపాడు)