నేటి నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్ | Realtors in AP, Telangana to go on 'cement purchase holiday' | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్

Jul 5 2014 12:10 AM | Updated on Sep 2 2017 9:48 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్డర్ల జేఏసీ ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్డర్ల జేఏసీ ప్రకటించింది. సిమెంట్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధరలను తక్షణమే తగ్గించకపోతే 12వ తేదీ తర్వాత అవసరమైతే నిర్మాణాలనూ ఆపేస్తామని హెచ్చరించింది.

రెండు రాష్ట్రాల్లో సిమెంట్‌కు ఏర్పడే డిమాండ్ నుంచి లబ్ధి పొందడానికే సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుతున్నాయని ఆరోపించింది. నెలక్రితం రూ.175-190 మధ్య ఉన్న ధరను ప్రస్తుతం రూ.320కు చేరడంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెబుతోంది. దీంతో అనివార్యంగా ఫ్లాట్ల ధరలను పెంచడంతో పాటు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేమని చెప్పింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement