'చంద్రబాబు-కరువు కవల పిల్లలు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి అవలంభిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రఘువీరా.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ రోజుకో మాట మాట్లాడుతున్నాయని విమర్శించారు.
ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని, దీనిపై టీడీపీ, బీజేపీలు రోజుకో మాట మాట్లాడుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న రామకృష్ణను జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని రఘువీరా తెలిపారు.


