క్వారీ పనుల నిలిపివేత | quarying works stopped after public hearing | Sakshi
Sakshi News home page

క్వారీ పనుల నిలిపివేత

Jan 30 2015 2:50 PM | Updated on Sep 2 2017 8:32 PM

గ్రానైట్ లీజుల ఏర్పటుకు సంబంధించి చేపట్టిన బహిరంగ విచారణలో ప్రజాభిప్రాయమే నెగ్గింది.

శ్రీకాకుళం(పాలకొండ): గ్రానైట్ లీజుల ఏర్పటుకు సంబంధించి చేపట్టిన బహిరంగ విచారణలో ప్రజాభిప్రాయమే నెగ్గింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో క్వారీ పనులు ప్రారంభించకూడదని భీష్మించుకున్న గ్రామస్తుల మాటకు విలువిస్తూ ప్రభుత్వం పనులను నిలిపేసింది. ఈ  మేరకు నిర్ణయం తీసుకుంది.

స్థానిక ఎమ్మెల్యే కళావతి స్వగ్రామంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ విచారణ ప్రశాంతంగా ముగిసింది. క్వారీ ప్రారంభానికి సంబంధించి గతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రజాతీర్పునకు విలువిస్తామని చెప్పడంతో ప్రజలు స్వతంత్రంగా తమ నిర్ణయాన్ని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement