పాలకుల చేతగానితనం ప్రజలను కష్టాల పాలు చేస్తోంది. నిత్యావసరాలు మొదలు.. పెట్రోలు, డీజిల్ వరకు ఎందులో చూసినా రాష్ట్రంలో ధరలు మండుతున్నాయి. జనం గుండెను మండిస్తున్నాయి. వ్యాట్ భారంతో పెట్రోలు, డీజిల్ ధరలు రాష్ట్రంలో కొండెక్కి కూర్చొన్నాయి. వ్యాట్ మంట తగ్గించాలని కోరినా, పాలకులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితిలో పెట్రోల్ బంక్ల యజమానులు బంద్ బాటపట్టారు.
- జిల్లాలో 220 పెట్రోలు బంకులు మూత
- ఇబ్బడిముబ్బడిగా వ్యాట్తో వ్యతిరేకత
- పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరలకు పెట్రోలు, డీజిల్
- ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్
ఒంగోలు సబర్బన్ : వ్యాట్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులు 24 గంటల పాటు బంద్తో తమ నిరసనను తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పెట్రోలు బంకుల ఆపరేటర్లు అందరూ ఒక్కతాటిపై నిలిచి ఒక్క రోజు బంకులు మూసేయాలని నిర్ణయించారు. ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పెట్రోలు బంక్లను మూసేస్తున్నారు. దీంతో జిల్లాలోని 220 పెట్రోలు బంకులు బంద్ కానున్నాయి.
మన రాష్ట్రంతో పోల్చుకుంటే అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో ప్రతి లీటరు డీజిల్, పెట్రోల్పై రూ.4 వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించటమే. దీంతో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ధరలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాహనదారులు నామమాత్రంగా డీజిల్ కొట్టించుకొని ట్యాంకులు, ట్యాంకులు పక్క రాష్ట్రాల్లో నింపుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీ సంస్థలు పెట్రోలు బంకులు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు పెట్రోలు, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. ప్రతి రోజూ లక్షల కొద్దీ లీటర్లు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే లీటరుకు రూ.2 నుంచి రూ.5.20 వరకు ధర మన రాష్ట్రంలో అధికంగా ఉంది.
ఇంతెందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకంటే రూ.2 తక్కువకు పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు అందుతోంది. సరిహద్దు రాష్ట్రమైన అటు తమిళనాడులో మనకంటే రూ.5.20 ధర తక్కువ. మరి మనోళ్లయినా.. పరాయి రాష్ట్రం వాళ్లయినా డీజిల్, పెట్రోలు మన రాష్ట్రంలో ఎందుకు కొట్టించుకుంటారు. వందల కిలో మీటర్ల ప్రయాణంలో వేల రూపాయలు ఆదా చేసుకోవాలని వాహనాల యజమానులు చూసుకుంటారు. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. ఈ పరిస్థితే వ్యతిరేకతకు దారితీసింది. ఒక రోజు పెట్రోలు బంకులు మూత పడితే కోట్లలో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. ఒక పక్క ఉల్లి లొల్లి కలవర పెడుతోంది. కిలో ఉల్లి ధర రూ.60 దాటుతోంది. కంది పప్పు, నూనెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత పట్టీ తయారవుతోంది.
బంకు ఆపరేటర్లు సహకరించాలి
రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లాలో పెట్రోలు బంకులు 24 గంటలు మూసేయాలని నిర్ణయించాం. అందుకు జిల్లాలోని డీలర్లు అందరూ సహరించాలి. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా చేస్తున్న ఈ ఆందోళన బంకుల డీలర్లతో పాటు ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి. వ్యాట్ తగ్గితే ప్రజలకు కూడా ధర వెసులుబాటు కలుగుతుంది.
వర ప్రసాదరావు, జిల్లా పెట్రోల్ డీలర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు
వ్యాట్ వాత.. ‘పెట్రో’ మూత
Published Mon, Aug 31 2015 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement