వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన | person died and relatives strike at hospital | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

Aug 4 2015 10:34 PM | Updated on Sep 3 2017 6:46 AM

తమ కుటుంబ సభ్యుడి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు.

అనంతపురం : తమ కుటుంబ సభ్యుడి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం వర్ని గ్రామానికి చెందిన ధనంజయకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఎస్పీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఈ రోజు డిశ్చార్జి చేశారు. అయితే ధనంజయను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ధనంజయ మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement