'విభజనపై ముందుకు వెళ్లే సత్తా కాంగ్రెస్కు లేదు' | Payyavula keshav comments on Telangana bill | Sakshi
Sakshi News home page

'విభజనపై ముందుకు వెళ్లే సత్తా కాంగ్రెస్కు లేదు'

Dec 14 2013 2:53 PM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ బిల్లు సభకు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ బిల్లు సభకు వచ్చినంత మాత్రాన చర్చకు వచ్చినట్లు కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... విభజన చర్చపై కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు విరామం అవసరమని ఆయన పేర్కొన్నారు. విభజన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం అవసరమన్నారు. విభజన ప్రక్రియను ముందుకు నడిపే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement