కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం | Oath of the new legislatives | Sakshi
Sakshi News home page

కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Mar 31 2017 2:14 AM | Updated on Aug 10 2018 8:23 PM

శాసనమండలికి ఎన్నికైన 14 మంది గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

లోకేశ్‌తో సహా 14 మంది..

సాక్షి, అమరావతి: శాసనమండలికి ఎన్నికైన 14 మంది గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్, పీడీఎఫ్‌ సభ్యుడు వి.బాలసుబ్రమణ్యం.. మండలి చైర్మన్‌ ఎ.చక్రపాణి కార్యాలయంలోను, మిగిలినవారు శాసనమండలిలోను ప్రమాణ స్వీకారం చేశారు.

వైఎస్సార్‌ సీపీ సభ్యులు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ ససభ్యులు బచ్చుల అర్జునుడు, కరణం బలరామకృష్ణమూర్తి, జి.దీపక్‌రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, బీటెక్‌ రవి, పోతుల సునీత, బీజేపీ సభ్యుడు పి.వి.ఎన్‌.మాధవ్, పీడీఎఫ్‌ సభ్యులు కత్తి నరసింహారెడ్డి, యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. అనంతరం వీరికి రాజ్యాంగం, కౌన్సిల్‌ నియమావళికి సంబంధించిన పుస్తకాలను మండలి చైర్మన్‌ చక్రపాణి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement